KMM: ఎర్రుపాలెం మండలం తెల్లపాలెంలో రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే నూతన విద్యుత్ లైన్ పనులను బుధవారం ADE అనురాధ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి చొరవతో కొత్త విద్యుత్ స్తంభాలు, నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.