NZB: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తైనందుకు బీజేపీ బ్లాక్ డేగా పాటిస్తుందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ 21 నెలలు చీకటి రోజుల పరిపాలన చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.