WNP: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్సై హరిప్రసాద్ వివరాల ప్రకారం. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లికి చెందిన జేసీబీ డ్రైవర్ నిరంజన్ పాషా(38) ఈ నెల 21న జిల్లా ఆసుపత్రిలో పనిచేసే తన భార్య రుబీనాను బైక్పై ఎక్కించుకుని బస్టాండులో దింపి కొత్తకోటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.