BPT: జిల్లాలో సిమౌత్ పూడికతీత పనులను బాపట్ల మండల రెవెన్యూ ఆఫీసర్ సలీమా బుధవారం పరిశీలించారు. ఆమెతో పాటు బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ పూడికతీత పనుల ద్వారా తీర ప్రాంతంలో మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షిస్తున్నామని సలీమా పేర్కొన్నారు.