W.G: భీమవరం వన్ టౌన్లో వేణుగోపాలస్వామి గుడి వద్ద నాగమణి అనే మహిళపై పోలిశెట్టి హేమంత్ బుధవారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నాగమణికి గాయాలు కాగా పరుగులు తీసుకుంటూ తన తల్లి వద్దకు చేరుకుంది. దీంతో తల్లి నాగమణిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.