KMM: బోనకల్ మండలం తూటికుంట్ల-నాగులవంచ మధ్యలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానిక రైతులు ప్రసాద్, లక్ష్మీ నరసయ్య అన్నారు. బుధవారం ప్రాజెక్టు ఆఫీసర్ను కలిసి రైతులు వినతి పత్రం అందించారు. హైవే పనుల్లో భాగంగా గ్రామాల నుంచి లారీలు వెళ్తుండడంతో అధిక మొత్తంలో దుమ్ము లేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.