శ్రీకాకుళం: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఏపీ హైకోర్టు జస్టిస్ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి, డిప్యూటీ కమిషనరు KNVD ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపిక అందజేశారు.