W.G: నర్సాపురం నిడదవోలు ప్రధాన రహదారిపై పెనుగొండ – అయితం పూడి మధ్య ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మునమర్రు గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.