అన్నమయ్య: చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ సంస్థాగ త ఎన్నికల పరిశీలకులుగా మదనపల్లెకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆపార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషాలకు కృతజ్ఞతలు తెలిపారు.