SKLM: టెక్కలిలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బంది వివరాలు వెల్లడించారు. టెక్కలిలోని పట్టుమహాదేవికోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రావివలస, చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో పర్యటించనునట్లు తెలిపారు.