KDP: చాపాడు మండలం వీ రాజుపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు భూ తగాదాలు కారణమని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుతున్నట్లు చాపాడు పోలీసులు తెలిపారు.