NLR: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలంలోని మోచర్ల వద్ద జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై లారీ వేగంగా దూసుకెళ్లింది. వెంకమ్మ(50), మమత(26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు రమణమ్మ, వైష్ణవిలు తీవ్రంగా గాయపడ్డారు. పోలేరమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా దర్యాప్తు ప్రారంభించారు.