WNP: ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన ఘటన ఇవాళ ఉదయం కొత్తకోట మండలంలో జరిగింది. బస్సు కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా పాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.