SKLM: జలుమూరు మండలం కరవంజ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్ఎం టి. ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో సైన్స్ తరగతుల సంబంధించి రెమిడీయల్ క్లాసులు నిర్వహించామన్నారు. సెలవు దినాలలో తప్ప మిగిలిన రోజులు ప్రతి సబ్జెక్టు పైన ఆయా ఉపాధ్యాయులతో క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.