SRD: R&B, పంచాయతీరాజ్ సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఐబీ నుంచి విగ్రహం వరకు 2.6 కిలోమీటర్లకు రోడ్డు వెడల్పుకు రూ.12 కోట్ల నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పాల్గొన్నారు.