MDK: నిజాంపేట మండలం నగరం తండా కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొససాగుతున్నాయి. గురువారం సీఈఓ నరసింహులు మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్ఛార్జ్ అరుణ్, సెంటర్ ఇన్ఛార్జ్ సుభాష్, రైతులు శంకర్, సురేశ్ ఉన్నారు.