VZM: టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున DCCB ఛైర్మన్ పదవి కేటాయించిన అనంతరం బుధవారం తొలిసారిగా ఆయన నివాసం చీపురుపల్లి వచ్చిన సందర్భంగా TDP నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనకు పదవిని కేటాయించినందుకు సీఎంకు, లోకేశ్కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం చేయడానికి, రైతులకు సేవ చేయడానికి పని చేస్తానని తెలియజేశారు.