ఈ నెల 22న జరిగిన RRB జేఈ సీబీటీ-2 రెండో షిఫ్ట్ పరీక్షను RRB రద్దు చేసింది. తొలి షిఫ్టులో వచ్చిన ప్రశ్నలు కొన్ని 2వ దాంట్లో రిపీట్ కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని వివరించింది. రద్దయిన పరీక్షను త్వరలో నిర్వహిస్తామని RRB వెల్లడించింది. 7,951 పోస్టులకు సంబంధించి సీబీటీ-1 పరీక్ష రాసి అర్హత సాధించిన 20,792 మంది తాజాగా సీబీటీ-2 రాశారు.