TG: రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.