ADB: భీంపూర్ మండలంలోని బేల్సరి రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ.5 లక్షలతో ఇంటిని ఏ విధంగా నాణ్యతగా నిర్మించుకోవాలో వివరించారు. హౌసింగ్ డీఈ శంకర్, తహశీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో గడ్డం గోపాలకృష్ణ రెడ్డి, హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి సాయితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.