AP: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో రేపు జరగాల్సిన పలు సేవా కార్యక్రమాలు, పూజలను నిలిపివేస్తున్నట్లు మఠం అధికారులు ప్రకటించారు. చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. గ్రహణం కారణంగా మఠంలో నిర్వహించే నిత్య అభిషేకాలు, నిత్య అన్నదానం, పరిమళ ప్రసాదం ఇతర అన్ని రకాల సేవా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయన్నారు.