KRNL: నాటుసారా విక్రయించే కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పునరావాస వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి అల్ఫోన్స్, ఎక్సైజ్ ఈఎస్ రవికుమార్ పాల్గొన్నారు.