పల్నాడు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.