ప్రకాశం: YS జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిని జిల్లా వైసీపీ సెక్రటరీగా పార్టీ అదిష్టానం నియమించింది. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైసీపీ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంకా పార్టీ పట్ల బాధ్యత పెరిగిందని, తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు.