కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కొండాలమ్మ చింత వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడుని వేరే అంబులెన్స్లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.