మధుమేహంతో బాధపడేవారికి మెంతులు ఒక వరం లాంటివి. రాత్రిపూట నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడపున తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, జుట్టు రాలడం తగ్గించడానికి, చుండ్రు నివారణకు మెంతుల పేస్ట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.