MNCL: ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు కొండుకూరు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి జంగం రవి కోరారు. బుధవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో మహా ప్రదర్శన ఉంటుందని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు.