అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుష్మిత్ సాయి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ తీర్థ, ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు.