CTR: ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పుంగనూరులోని అంజుమన్ షాదీమహల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ MS సలీం తెలిపారు. శుక్రవారం పట్టణంలోని షాదీమహల్లో సమావేశమై క్యాంప్ నిర్వహణపై చర్చించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.