BHNG: మండలలోని కేంద్రమైన దూది వెంకటాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.