HYD: కుల్సంపుర పోలీసులు ఘరానా దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ నెల 24న జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు అడ్డుకుని, అతడిపై దాడి చేసి ఆయన బైక్తో పరారయ్యారు. బాధితుడు కుల్సంపుర పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.