మాజీ ప్రధాని మన్మోహన్ ప్రస్తుత పాకిస్తాన్లో పంజాబ్లోని గహ్లో 1932లో సిక్కు కుటుంబంలో జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయస్సులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ దగ్గర పెరిగారు. పాక్ నుంచి వచ్చి భారత ప్రధానిగా ఎన్నికై చరిత్ర కెక్కారు. సిక్కు సమాజం నుంచి భారత ప్రధానిగా ఎన్నికైన తొలి ప్రధానిగా ప్రసిద్ధి గాంచారు.