MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని నర్సాపూర్ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.