ADB: జన్నారం మండలంలోని టీజీ పల్లి గ్రామానికి చెందిన మాదంశెట్టి అశోక్ కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం జన్నారం మండల నాయకులు రూ.1.07 లక్షల ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించారు. అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జన్నారం దండేపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు కులస్తులు విరాళాలను సేకరించి రూ.1.07 లక్షల బాండ్లను అశోక్ కుటుంబానికి అందించారు.