MNCL: కాసీపేట మండలం దేవాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకులు CITU ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10వేల వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనం చెల్లించాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.