MBNR: విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మదర్సా ఇస్లామియా కాసిఫ్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే దుప్పట్లను పంపిణీ చేశారు. ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.