SKLM: విశాఖ జోన్1 పరిధిలో జరిగిన T 20 క్రికెట్ పోటీల్లో శ్రీకాకులం బధిరుల జట్టు విజేతగా నిలవడంతో క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం అభినందించారు. ZP సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 5 జిల్లాలతో పోటీపడి ట్రోఫీని గెలుచుకోవడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. బధిర సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.