కృష్ణా: ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందింది. స్థానిక జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న పోలా గీతామాధురి (15) అనే విద్యార్థిని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి సాయంత్రానికి తండ్రి ఇంటికి వచ్చే సమయానికి విగత జీవిగా మంచంపై ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.