ATP: మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్ట్ పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్ కుమార్ను గుంతకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియాలో బ్రాహ్మణిపై అనుచిత పోస్ట్ పెట్టాడంటూ ఇటీవల స్థానిక టీడీపీ నేత ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి యువకుడికి నోటీసులు ఇచ్చారు.