విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీకి చెందిన మహమ్మద్ ముజామ్మిల్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి లభించినట్లు రైల్వే ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.