ప్రకాశం: దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల రైతులకు పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రమేష్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన పెరటి కోళ్లు, తేనెటీగలు, గొర్రెలు, మేకల పెంపకాలను చేపట్టాలని సూచించారు. అనంతరం పెరటికోళ్లను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.