PLD: సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాచవరం ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సుస్థిరాభివృద్ధిపై శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, సర్పంచులకు, మండల స్థాయి అధికారులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు.