TPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 150 అర్జీలు వచ్చాయని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.