KDP: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ సర్కిల్లో సీపీఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు.