కోనసీమ: మహాకవి, పద్మభూషణ్, డాక్టర్ బోయి భీమన్న వర్ధంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా సోమవారం బోయి భీమన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మామిడికుదురులోని బోయ భీమన్న మానవ వనరుల కేంద్రం ప్రాంగణంలోని భీమన్న కాంస్య విగ్రహా వద్ద భీమన్న పద్యం, గద్యం, వచనం, సాహిత్య రచనలతో సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటం చేశారని వేమా కొనియాడారు.