VZM: గత సెప్టెంబర్ నెలలో ఉమ్మడి విజయనగరానికి చెందిన పార్వతీపురానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బదిలీల బాగోతంపై దర్యాప్తు జరపాలని NHRC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన PGRSలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ప్రభుత్వ గైడ్లైన్స్కు విరుద్ధంగా జరిగాయంటూ DRO హేమలతకు ఆయన ఫిర్యాదు చేశారు.