ELR: పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో సోమవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.