W.G: జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం ప్రకాశం చౌక్ నుంచి పీపీ రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తులో విద్యుత్ సమస్య ఉండదన్నారు.