KDP: మండల కేంద్రమైన వేముల పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఘాటుగా విమర్శించారు.