NRML: బాసర త్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంత్రి త్రిబుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రిబుల్ ఐటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.